Home » Ramgopal Varma
దహనం వెబ్ సిరీస్ అంశంలో ఆర్జీవీపై అంజనాసిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్లో అంజనాసిన్హా పేరు ప్రస్తావించారు. అంజనాసిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీసినట్లు ఆర్జీవీ ప్రస్తావించారు.
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై గత ఏడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూమండిపడ్డారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కాపునాడు నాయకులు అమలపురంలో ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది.
ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని రాంగోపాల్ వర్మ అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
జగన్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను ఎందుకు వాడకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల ఫలాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని చెప్పారు. ఉప రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని ఈరోజు కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీ డియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు.