Home » Rajahmundry
Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది.
Andhrapradesh: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోడిపందేలు,గుండాట జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందెం బరులు వెలువగా.. ప్రేక్షక పాత్ర వహించడం పోలీసులవంతైంది.
Andhrapradesh: అవినీతికి సహకరించే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎర్రగడ్డకు పంపించటానికి జగన్ అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు.
Andhrapradeshh: రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలలో ఇసుక అక్రమ మైనింగ్పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి పోలీసు కమీషనర్కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్లో అక్రమ మైనింగ్పై నివేదిక సమర్పించాలని కమీషనర్కు ఆదేశించింది.
Andhrapradesh: రాష్ట్రంలో మిచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో పలు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.