Home » Rajahmundry
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
పనికిమాలిన చెత్త సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు.
అప్పట్లో ఎన్టీఆర్పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
సామర్లకోట: చంద్రబాబును జైల్లో పెట్టి సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆరోపించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి సామర్లకోటలో ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చారని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టి తాను రాష్ట్రమంతా తిరగాలని జగన్ చూస్తున్నారని.. అందుకోసమే ఈరోజు జగన్ సామర్లకోట వచ్చారని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిముషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు.
స్కిల్డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా సీతానగరంలో భువనేశ్వరి రిలే నిరాహార దీక్ష చేపట్టారు.