Home » Railway Zone
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్ సైడ్ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.
వందేభారత్ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఆయనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నిగ్గు తేలేవరకు ఆయనను రాష్ట్రంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఐఆర్ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లగా జారుకున్నారు. తన మాతృశాఖ రైల్వే్సకు వెళ్లిపోయారు. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో జాయిన్ కావాల్సిందిగా ఈ నెల 13వ తేదీన రైల్వే బోర్డు ఆయనకు ఆదేశాలిచ్చింది.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్లో బయలుదేరారు.
Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్లోనూ బ్లాక్ బాక్స్(Black Boxes) ఏర్పాటు చేయాలని..
భారతీయ రైల్వే(Indian Railways)లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్న్యూస్ రాబోతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు 2024(lok sabha 2024 elections) ముగిసిన తర్వాత భారతీయ రైల్వే తన 100 రోజుల ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ యాప్(Super app)తోపాటు ప్రయాణికుల సౌకర్యాలను పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది.
దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా రైల్వేలు నిలుస్తున్నాయి. చాలా మంది రైలు ప్రయాణం ( Indian Railway ) చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రైల్వేలు కిటకిటలాడుతున్నాయి. సీట్లు దొరకని పరిస్థితి.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.