Home » Railway News
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీలైన ప్రతి చోటా చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసేస్తున్నారు. కొందరు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పై పెచ్చులు పడుతూ 7 ఏళ్ల మణికంఠ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది.
అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.
పటాన్చెరు-ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ గడ్డం నాగేశ్ రైల్వే అధికారులను కోరారు. రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సానుకూలంగా స్పందించి, అంచనాలు రూపొందించి బోర్డుకు పంపనున్నట్లు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, దలేల్నగర్, ఉమర్తాలి స్టేషన్ల మధ్య పట్టాలకు సోమవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్తింగ్ వైర్ను ఉపయోగించి చెక్క పలకలు కట్టారు. ఢిల్లీ నుంచి అసోంలోని డిబ్రూగఢ్కు వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (20504) లోకో పైలట్ సకాలంలో ట్రాక్పై అడ్డంకులు ఉన్నట్టు గ్రహించి అత్యవసర బ్రేకులు వేశారు.
RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9000 లకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం..
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రైల్వే మంత్రిని కోరారు. జలంధర్, జమ్ము, కురుక్షేత్ర, చండీగఢ్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ప్రతి 10 నిమిషాలకో బస్సు నడిచేలా ఏర్పట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. చర్లపల్లిలో కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడినుంచే కొన్ని రైళ్ళ రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ నుంచి ఇతర ఏరియాలకు పది నిమిషాలకో బస్సును ఏర్పాటు చేశారు.
నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్ను 1916లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ప్లాట్ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది.