• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghu Rama: రెండు, మూడు రోజుల్లో శుభవార్త వింటారు

Raghu Rama: రెండు, మూడు రోజుల్లో శుభవార్త వింటారు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) స్పష్టం చేశారు. బుధవారం నాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది.

CM Jagan: నేడు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

CM Jagan: నేడు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

నేడు జగన్ బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రఘురామ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు.

AP News: ఏప్రిల్ 1న జగన్ బెయిల్‌ రద్దుపై సుప్రీంలో విచారణ

AP News: ఏప్రిల్ 1న జగన్ బెయిల్‌ రద్దుపై సుప్రీంలో విచారణ

ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

AP Elections: రఘురామకు పశ్చిమలో సీటు!

AP Elections: రఘురామకు పశ్చిమలో సీటు!

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్‌ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.

Raghurama: నాకు ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు

Raghurama: నాకు ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు

పీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యా‌చ్‌తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు.

AP Politics: పోలీసులు అలా ఎందుకు చేశారు.. ఎంపీ రఘురామ తీవ్ర ఆగ్రహం

AP Politics: పోలీసులు అలా ఎందుకు చేశారు.. ఎంపీ రఘురామ తీవ్ర ఆగ్రహం

ఏపీలో15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. తన దగ్గర సమాచారం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(MP Raghurama Krishnamraju) అన్నారు. ప్రజలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల దాడులను ప్రజలు తట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు.

Raghurama Krishnaraju: సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై ప్రధానికి రఘురామ లేఖ

Raghurama Krishnaraju: సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై ప్రధానికి రఘురామ లేఖ

ప్రధాన మంత్రి మోదీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టడంపై లేఖలో ప్రస్తావించారు. ఎన్నడూ లేని విధంగా రూ.350 కోట్లకు సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టేశారన్నారు. ప్రధానమంత్రిని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసే లోపే తాను లేఖ రాశానన్నారు. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం ఉల్లంఘనలు చేస్తోందని దీనిపై విచారణ చేయాలని కోరానన్నారు.

AP Politics: నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ!

AP Politics: నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ!

నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేను చేపడుతోంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామ కృష్ణరాజు పేరు వినిపిస్తోంది. నర్సాపురం నుంచి రఘురామ ‘ఓకే అయితే 1 నొక్కండి’ అని వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Raghurama Krishnaraju: వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

Raghurama Krishnaraju: వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా

ఇంతకాలం పాటు వైసీపీలోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి