Home » Pulivendula
kadapa Dist: పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ను కొంతమంది వెంబడించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Mahanadu: పులివెందుల (Pulivendula)లో మహానాడు (Pulivendula) టీడీపీ తోరణాలను (TDP Banners) తొలగించిన వైసీపీ శ్రేణుల (YCP Activists)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి (PA Raghav Reddy), మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్ (Varaprasad)లతోపాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 191,2. 191,3. 324,4.109 రెడ్ విత్ 190 బీఎంఎస్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు.
Pulivendula Tension: పులివెందులలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ మహానాడు సందర్భంగా పులివెందులలో తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన వారు నానా బీభత్సం సృష్టించారు.
SIT Investigation: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సిట్ విచారిస్తోంది.
మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.
Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
మండల పరిధిలోని రాయలచెరువులో భూ సమస్య పెద్ద వివాదానికి దారితీసింది. రాయలచెరువులోని ప్రైవేట్ ల్యాండ్ను తాము కొన్నామని పులివెందులకు చెందిన కొందరు వ్యక్తులు ఐదు వాహనాల్లో మంగళవారం రాయలచెరువుకు వచ్చారు. ఆ భూమిలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అదే సమయంలో ఆ భూమి తమ అధీనంలో ఉందని, సర్వ హక్కులు ఉన్నాయంటూ రాయలచెరువుకు చెందిన ...
Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు మరో సంచనలంగా మారాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోవడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది.
Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.
Political War in YSRCP: వైసీపీ పులివెందులలో రోజురోజుకూ వర్గపోరు తీవ్రరూపం దాల్చుతుంది. ఈ పోరుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్ల మధ్య వర్గ పోరు ఓ రేంజ్లో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది.