Home » Pulivarthi Nani
తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.
ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ద్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే.. వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదని ఆయన అన్నారు.
Puli Varthi Nani: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెద్దిరెడ్డి విచక్షణ రహితంగా మాట్లాడితే చూస్తు ఊరుకోమని ఎమ్మెల్యే పులివర్తి నాని వార్నింగ్ ఇచ్చారు.
‘చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్మి వైసీపీ నేతలు పదేపదే మోసపోతుంటారు. ఎర్రావారిపాలేనికి చెందిన బాలిక తండ్రిని నేనెప్పుడూ విమర్శించను. గతంలో ఆయన ఏమి మాట్లాడారో, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడో ప్రజలందరికీ తెలుసు. చెవిరెడ్డి చేసింది తప్పు కాదా? అని మాత్రమే ఆలోచించండి. మనకి కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మీవిజ్ఞతకే వదిలేస్తున్నా’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని(Chandragiri MLA Pulivarthi Nani) వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..