• Home » Protest

Protest

Students Protest: ఆహారంలో పురుగులపై మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన..

Students Protest: ఆహారంలో పురుగులపై మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన..

మైసమ్మగూడ ప్రాంతంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University)లో విద్యార్థులు మరోసారి ఆందోళన (Students Protest)కు దిగారు. అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ యూనివర్శిటీ ఎదుట బైఠాయించి "మల్లారెడ్డి డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

BJP:  ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఏం చెప్పిందంటే..?

BJP: ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఏం చెప్పిందంటే..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆరోపించారు. ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 BJP: ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా

BJP: ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయనున్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు. పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Congress Vs BRS: చార్మినార్ ముందు బీఆర్ఎస్ ధర్నా.. హైదరాబాద్‌లో హైటెన్షన్

Congress Vs BRS: చార్మినార్ ముందు బీఆర్ఎస్ ధర్నా.. హైదరాబాద్‌లో హైటెన్షన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో నుంచి చార్మినార్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిరసన వ్యక్తం చేస్తూ.. చార్మినార్ ముందు ధర్నా చేపట్టారు. కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చార్మినార్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!

జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.

Road Accident: భార్య, పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడా..!

Road Accident: భార్య, పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడా..!

రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

TDP: ఎస్పీకి, ఆయన ఫ్యామిలీకి మేమే రక్షణ కల్పిస్తాం: సుధారెడ్డి

TDP: ఎస్పీకి, ఆయన ఫ్యామిలీకి మేమే రక్షణ కల్పిస్తాం: సుధారెడ్డి

తిరుపతి: పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు ఆయనపై దాడి చేశారు. సుమారు 150 మంది మారణాయుధాలతో దాడి చేయగా నానీ భుజానికి గాయమైంది.

PROTEST : మౌలిక వసతులు కల్పించాకే ఓటు

PROTEST : మౌలిక వసతులు కల్పించాకే ఓటు

మా కాలనీకి తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత సౌకర్యం కల్పించాకే ఓటు వేస్తాం’ అని మండల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, కొటిపి పంచాయతీకి చెందిన భరత నగర్‌ కాలనీ వాసులు సోమవారంనిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే ఇందిరమ్మ, భరతనగర్‌ కాలనీ వాసులు మాత్రం ఎన్నికలను బహిష్కరించారు. తమ కాలనీలకు మౌలిక వసతులు కల్పించాకే ఓటు వేస్తామని ఖరాకండిగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహించారు.

DHARNA ; నేహ హత్యను ఖండిస్తూ ఏబీవీపీ ధర్నా

DHARNA ; నేహ హత్యను ఖండిస్తూ ఏబీవీపీ ధర్నా

కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి పట్టణంలోని ఎమ్మెస్సీ విద్యార్థిని నేహ హీరేమఠ హత్యను ఖండిస్తూ పావగడలోని ఏబీవీపీ వైద్యకీయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. హుబ్బళ్లి నగరంలోని బీబీవీ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతున్న నేహహీరేమఠను ఫయాజ్‌ అనే వ్యక్తి తొమ్మిదిసార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపిన ఘటన క్షమించరానిదని ప్రముఖ వైద్యుడు వివేకానంద విద్యా సంస్థ కార్యదర్శి డాక్టర్‌ జి వెంకటరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Protest: ప్రధాని రాజీనామా చేయాలని వీధుల్లోకి వచ్చి ఆందోళన..పలువురికి గాయాలు

Protest: ప్రధాని రాజీనామా చేయాలని వీధుల్లోకి వచ్చి ఆందోళన..పలువురికి గాయాలు

ఇజ్రాయెల్‌(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి