Home » Priyanka Gandhi
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్కృష్ణ హోటల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు.
Telangana Elections: తెలంగాణలో పోలింగ్ ఊపందుకుంది. ఉదయం నుంచే రాజకీయ, సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులు కూడా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
Telangana Elections: జిల్లాలోని జహీరాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో అగ్రనేత ప్రియాంక గాంధీ, పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ రోడ్షోకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. జహీరాబాద్లో కార్నర్ మీటింగ్లో ప్రియాంక ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాటపై ప్రియాంక గాంధీ స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. దొరల తెలంగాణ కావాలో... ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక అన్నారు. దేశంలో ఫామ్ హౌస్లో ఉండి పాలించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదు. తెలంగాణలోని పెద్ద నేతలు ఫామ్ హౌస్లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు.
యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రేపటితో (మంగళవారం) తెరపడునున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఛత్తీస్ఘడ్ సీఏం భూపేష్ భగేల్ ఈరోజు పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు.
Telangana Elections: పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజయాన్ని కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలం, కాల్వోడ్డు, పెద్దతండా, నాయుడుపేట, నాయుడుపేట క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్ వరకూ ప్రియాంక రోడ్ షో జరుగనుంది.