Home » Prime Minister
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై 'ఇండియా' కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇదేమీ వ్యక్తుల మధ్య 'బ్యూటీ కాంటెస్ట్' కాదన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న భారతీయులు ఇప్పుడు ఐర్లాండ్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం డీప్ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్సైట్లో అప్లోడ్ చేశారు.
కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.
రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచారు. దహల్కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.