Home » Prakasam
ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. భూ ప్రకంపనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతోందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.
ముండ్లమూరు(Mundlamuru)లో మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.
ప్రకాశం జిల్లా: టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2‘ చిత్రం విడుదల కావడంతో ఓ హీరోగా ఆయన థియేటర్ సినిమా చూసేందుకు వెళ్ళారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
Andhrapradesh: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. 100 దేవాలయాల్లో 300 వెండి ఆభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకోవడంపై హోంమంత్రి అనిత అభినందించారు.
నడిరోడ్డుపై వదిలేసిన 75 ఏళ్ల వృద్ధిరాలు వెంకట లక్ష్మమ్మపై ఏబీఎన్ ప్రసారంతో ఆమెకు ఊరట లభించింది. ఆమె ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు. 20 రోజులుగా ఆమె చలిలో ఇబ్బందులు పడుతోంది. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారమైంది. దీంతో...
జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.