Home » Power Bill
హైదరాబాద్(Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు(Power Supply) అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) తెలిపారు. దాదాపు గంటన్నర పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది? కారణమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం..
రాష్ట్రంలో గృహేతర విద్యుత్తు చార్జీలను పెంచేందుకు డిస్కమ్లు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 2024-25ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదికను విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించాలని డిస్కమ్లు నిర్ణయించాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డిస్కమ్లు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి.
వర్షాకాలం ప్రారంభానికి ముందే విద్యుత్ లైన్ల మరమ్మతులను పూర్తిచేసే దిశగా విద్యుత్శాఖ(Electricity Department) చర్యలు చేపట్టింది. ఒక్కో ఫీడర్ పరిధిలో అరగంట విద్యుత్(Power Supply Off) బంద్ చేసి పనులు చేపట్టనుంది. ఈమేరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఎల్సీ(లైన్ క్లియరెన్స్) ఇచ్చేందుకు విద్యుత్శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ముఖ్యమంత్రి జగనరెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత చార్జీలు పెంచబోమని జగనరెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎడాపెడా విద్యుత చార్జీలు పెంచేశారు. ఒక్కసారి రెండు సార్లు కాదు..
ఎండ వేడిమి, వడగాడ్పులతోనే ఇబ్బంది పడుతుంటే విద్యుత సమస్యలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేసవి కాలం కావడంతో విద్యుత వినియోగం పెరిగింది. లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా ఇళ్లలో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్యను అధిగమించేందుకు విద్యుత శాఖ చేపడుతున్న పనులు ప్రజలకు ఉపశమనం కలిగించలేకపోతున్నాయి. దీంతో ప్రజలు విద్యుత శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేలకు వేలు బిల్లులు వేస్తున్నారు కానీ సమస్యలు తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలే వేసవి కాలం. ఆపై అప్రకటిక విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పట్టణంలోని బీబీ కాలనీ లో ఓ వైసీపీ నాయుడు అపార్టుమెంట్ను నిర్మించాడు. దానికి ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే అనుకున్నదే తడువుగా వైసీపీ నాయకుడి సేవకు విద్యుత శాఖ సిద్ధమైపోయింది. దీంతో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి 2 దాకా మూడు గంటలు ఏకధాటిగా విద్యుత కోత విధించారు.
దాదాపు ఐదేళ్లుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల వేళ కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు.