Home » Politics
టీఎంసీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీలంతా తమనే అసలైన టీఎంసీగా పరిగణించాలని కోరుతూ స్పీకర్ను కోరేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్లో నెలకొన్న తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె మధ్య సోషల్ వేదికగా మాటల యుద్ధం సాగింది. వివరాల్లోకెళితే...
టీఎంసీ తిరుగుబాటు ఎంపీల జాబితాలో తన పేరుందన్న వార్తలను శత్రుఘ్న సిన్హా ఖండించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తాను తిరుగుబాటు చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించి ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీకు మంత్రి పదవి వరించింది.
తన రాజకీయ ప్రవేశంపై కీలక రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ఇటీవల వెల్లడించిన రాఘవ లారెన్స్.. తాజాగా ఆ తేదీని వాయిదా వేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూయడంతో ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్కు అవకాశం కల్పించింది.
రోజు గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ఆమె విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు.
లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ కన్నుమూశారు. 97 ఏళ్ల కశ్యప్ దీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటలకు తన నివాసంలో గుండెపోటుతో మరణించారని లోక్సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.
సోనార్పూర్లో తనపై జరిగిన దాడిని టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఖండించారు. తనపై జరిగిన దాడిని రాజకీయ హింసగా అభివర్ణించారాయన.