Home » Politics
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించి వాటి సమస్యలపై మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు.
ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని కవిత వ్యాఖ్యానించారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.
భక్త కనకదాస జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని అన్నారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
కర్నూలు నుంచి విశాఖపట్నంకు మూడు ఇందిరా బస్ సర్వీస్లను శనివారం మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. గతంలో వైజాగ్ కు సూపర్ లగ్జరీ సర్వీస్ ఉండేదిని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టూరిజం డెవలప్మెంట్కు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కోర్టులో ఆయన మెమో దాఖలు చేశారు. ఈ నెల 14లోపు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గడువు సమీపిస్తుండటంతో ఆయన మెమో దాఖలు చేశారు.
రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈనెల 12న మంత్రిమండలి మీటింగ్కి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై శుక్రవారం రెండవరోజు విచారణ జరుగనుంది. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను విచారించారు. నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీలను స్పీకర్ విచారించనున్నారు.
హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్ గాంధీ ప్రస్తావించిన మోడల్ ఎవరో తెలిసిపోయింది.
తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలుపొందిన మహిళా క్రికెటర్లతో పీఎం మోదీ భేటీ అయ్యారు. సరదాగా సాగిన ఈ సంభాషణలో భాగంగా ఓ మహిళా క్రికెటర్.. ఊహించని రీతిలో మోదీని ప్రశ్నించారు. ఇంతకీ ఆ మహిళ అడిగిన ప్రశ్న ఏంటి? దానిని మోదీ ఏ విధంగా ఎదుర్కొన్నారు? తెలుసుకోవాలంటే.. ఈ వార్తను చదవాల్సిందే.
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు13.13% శాతం పోలింగ్ నమోదైంది. మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.