Home » Politics
ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్ కోఆర్డినేటర్లు పని చేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని పార్టీ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూ, ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతతో ప్రమాణస్వీకారం చేయాలని చెప్పారు.
ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందేమాతరమని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందు తీసుకెళ్తున్నారని అన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం (నవంబరు 11) నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఆజాద్ స్పూర్తితో విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తి గత హాజరుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (CBI)కి న్యాయస్థానం ఆదేశించింది. CBI court order: జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ ధాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం
తిరుమల ప్రసాదంలో కల్తీ ఘటనపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగుతోందని చెప్పారు. తిరుమల పవిత్రతను జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దెబ్బ తీసి మహాపాపానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు. అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలన్నారు. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. త్వరితగతిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరం ముగింపు దశకు చేరింది. మంగళవారం జరిగే పోలింగ్పై ఇన్చార్జీలు, స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేలా..
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించి వాటి సమస్యలపై మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు.
ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని కవిత వ్యాఖ్యానించారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.