Home » Politics
గాండ్లపెంట, ఏప్రిల్ 29: కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని గొడ్డివెలగల పంచాయతీ దాసరవాండ్లల్లి, గేదర్ల, పాలంవాండ్లపల్లి, నీరుకుంట్లపల్లి, ఎర్రగోగులపల్లి, వంకలోపల్లి, తుమ్మలబైలు పెద్దతండా, సాదులవాండ్లపల్లి, తుమ్మలబైలు, కోటినేపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. అలాగే తూపల్లి పంచాయతీలోని వంకపల్లి, కటకంవారిపల్లి, పోరెడ్డిపల్లి గ్రామాల్లో నూ ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్థులు, స్థానిక నాయకులు పూల వర్షం కురిపిస్తూ, బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు.
‘‘కొడకల్లారా.. టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! ఉంటే వైసీపీలో ఉండండి. లేదంటే ఊరు విడిచి వెళ్లండి..! పరిటాల వాళ్లు ఇక్కడికి ఎలా వస్తారు..?’’ ఇదీ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వార్నింగ్..! తమ స్వగ్రామం తోపుదుర్తిలో అనుచరులతో కలిసి ఆయన భయానకవాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో దౌర్జన్యాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు....
ధర్మవరం, ఏప్రిల్ 28: ప ట్టణంలోని సీఎనబీ ఫంక్షన హాల్లో ఆదివారం బెంగళూర్కు చెందిన తెలుగు ప్రొఫెషనవింగ్ సభ్యులు హిందూపురం పార్లమెంట్ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధితో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో బీకే పార్థసారధి మాట్లాడుతూ...
తనకల్లు, ఏప్రిల్ 28: చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, ఆయన సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు.మండలంలోని కోర్తికోట పంచాయతీలో గల గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత తిరు మయ్యగారిపల్లిలో ప్రచారం నిర్వహించారు.
ధర్మవరంరూరల్, ఏప్రిల్28: చంద్రబాబు ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జడ్పీ మాజీ చైర్మన చిగిచెర్ల ఓబిరెడ్డి, మాజీ ఎంపీపీ కుణుతూరు వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఆదివారం వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి పథకాలపై ప్రచారం నిర్వహించారు.
ధర్మవరంరూరల్, ఏప్రిల్28: తాను అధికారంలోకి రాగానే వార్డులు, గ్రామాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. పట్టణంలోని గిర్రాజుకాలనీ, సత్యసాయినగర్, దు ర్గానగర్, 33, 34, 35 వార్డులు, మారుతీనగర్, రాజేంద్రనగర్, లక్ష్మీనగర్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.
నల్లమాడ, ఏప్రిల్ 28: భూ దందాలు చేసి పబ్బం గడుపుకుంటున్న ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని ఓడిద్దామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పాతబత్తలపల్లి పంచాయతీ పాతబత్తలపల్లి, చండ్రాయునిపల్లి, నల్లగొండ, యనుములవారిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి గ్రామాల్లో ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
వైసీపీ అధినేత, సీఎం జగన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ‘కొత్త సీసాలో పాత సారా’ అని జనం పెదవి విరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫేస్టోనే మళ్లీ విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఏదో ఉంటుందని ఆశించిన వైసీపీ అభ్యర్థులు మరింత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన బటన నొక్కుడుకే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని మరిచారు. ఇదే అంశం అభ్యర్థులను భయపెడుతోంది. ప్రజలకు ఏం చెప్పి ఓట్లు ...
బత్తలపలి,్ల ఏప్రిల్ 27: మండలంలోని వరదాపురం, విశ్వనాథ్పురం, చిన్నయకుంటపల్లి, ఓబుళాపురం, రామాపురం, కోడేకడ్ల, జ్వాలాపురం, తంబాపురం, చెన్నరాయపట్నం, అప్రాచెరువు, గుమ్మల్లకుంట, పోట్లమర్రి గ్రామాలలో శనివారం కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.
కొత్తచెరువు, ఏప్రిల్ 27: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బైరాపురం పంచా యతీలో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామస్థులు, స్థానిక నాయ కులు ఆమెకు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తర్వాత టీడీపీ మద్దతు సర్పంచ రవి ఏ ర్పాటు చేసిన ఎడ్లబండిని తోలుతూ రోడ్డుషో చేశారు.