Home » PM Modi
మహాగఠ్బంధన్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బయటపెట్టిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత కృషిని ప్రధాని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధిని ఎన్డీయే కొనసాగిస్తుందని, యువకులు, మహిళల బంగారు భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.
సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి రానున్నారు.
ప్రజల నివాసానికి, జీవన వికాసానికి అత్యంత ప్రముఖమైన నగరంగా సాగరనగరం విశాఖను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముంబై, వారణాసి, సూరత్, విశాఖల అభివృద్ధికి కేంద్రం సరికొత్త విజన్ తెచ్చిందని..
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.
రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.