Home » PM Modi
పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చోట ఆగి 'ఝుల్మురి' కొనుక్కు తినడాన్ని ఒక 'డ్రామా'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొట్టివేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు.
భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు ఒప్పందాలు కుదిరాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్లో ఆదివారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. పురూలియా, ఝార్గ్రామ్, మేదినీపూర్, బిష్ణుపూర్లలో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రచారానంతరం ఝూర్గ్రామ్లోని ఒక చిన్న దుకాణంలో రుచిరకమైన మరమరాలు (ఝుల్మురిని) తింటూ కొద్దిసేపు అక్కడి స్థానికులతో మమేకమయ్యారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై మోదీ విమర్శల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కుమ్మక్కై దిగువసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించారని, ఇందువల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం జరగలేదని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ కలలను సాకారం చేసి, చరిత్రను లిఖించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. భ్రూణహత్యకు పాల్పడిన కాంగ్రెస్ను, భాగస్వామ్య పార్టీలను మహిళలు ఒక్కనాటికీ క్షమించరని అన్నారు.
పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోదించిన 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్టు తెలిపారు.