Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు దేశాల ప్రధానులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నారు.
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చి తల దాచుకున్నారు. ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు కుట్ర జరిగిందని, తల్లిని సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ పేర్కొన్నారు.
పుట్టపర్తి/టౌన/రూరల్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. హిల్వ్యూ స్టేడియంతో బుధవారం నిర్వహించిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, కేంద్ర మంత్రులు భూపతి రాజు...
జీ-20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అలా బటన్ నొక్కడమే ఆలస్యం.. దేశ వ్యాప్తంగా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చెందాయి..
ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయి బాబాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని పేర్కొన్నారు ప్రధాని మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు.