Home » PM Modi
మోదీ ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అలాగే మూడుసార్లు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇండియా-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్ను ప్రధాని మోదీ ఆహ్వానిస్తూ, ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలియజేశారు. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 5-6 తేదీల్లో ఇండియాకు రానున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా నటించి రామారావు అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. మోసాలు చేస్తున్న రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
సుప్రీంకోర్టులో ఒక కేసుపై విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సీజేఐపై బూటు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే అది బెంచ్ వరకూ వెళ్లలేదు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.
భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలక పాత్ర పోషించనుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో భారత్ టాప్ 10లో ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.
భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ముంబై.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో జతచేరుతుంది.
నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించే యువశక్తిని సన్నద్ధం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్యంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ)లు ఆత్మనిర్భర్ భారత్కు కీలకమైన వర్క్షాప్లని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇవి పారిశ్రామిక విద్యా సంస్థలు మాత్రమే కాదని, దేశంలోని యువతకు ఒక దిక్సూచీలని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.