Home » Pithapuram
తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మతో జనసేన ( Janasena ) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై ఇరువురు గంటపాటు చర్చించారు. నాలుగు రోజుల పవన్ పర్యటన షెడ్యూల్ పై మాట్లాడుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు.
పిఠాపురంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. నేటి నుంచి పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చేబ్రోలులో మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.
పిఠాపురం.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హట్ టాపిక్.. రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటమే. నియోజక వర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పిఠాపురం నియోజక వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సీటును టీడీపీ నుంచి వర్శ ఆశించారు. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో వర్మ కొంత అసంతృప్తికి లోనయ్యారు
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పావులు కదుపుతున్నారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ(YSRCP) అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రయత్నిస్తున్నారు. అసంతృప్తులు గత కొంత కాలంగా జగన్ వైఖరిని తప్పుపడుతూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేతలను బుజ్జగించేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేతలకు ఏదో ఒక హామీని ఇస్తూ శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల (AP Elections) వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలతో అన్ని పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ(Assembly)తో పాటు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో ఎన్నికల బరిలో ఎవరుంటారో అధికార వైసీపీ, కూటమి తరపున టీడీపీ-జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు.
AP Elections 2024: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా కూడా పోటీ చేస్తారా..? అది కూడా కాకినాడ (Kakinada) పార్లమెంట్ స్థానమేనా..? సేనాని హస్తిన పర్యటన తర్వాత అటు జనసైనికుల్లో.. ఇటు టీడీపీ శ్రేణుల్లో వచ్చిన మొట్ట మొదటి ప్రశ్న ఇదే..
Pawan Vs RGV: పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది..