Home » Payyavula Keshav
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ భయాన్నే చూసిందని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారని ఆరోపించారు.
రుషికొండ నిర్మాణాలపై మళ్ళీ నిర్మాణాలు చేసే అవకాశం ఉందని.. పైన రెండు ఫ్లోర్లు వేసుకునే అవకాశం ఉందని మంత్రి పయ్యావుల తెలిపారు. రుషికొండ చివరి రెండు బ్లాక్లు ప్రజలకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు, టూరిస్ట్ అవసరాల కోసం ఉంచుతామని చెప్పారు.
రుషికొండ ప్యాలెస్ వినియోగానికి సంబంధించి టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్లో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.
చంద్రబాబు బ్రాండ్ చూసే గూగుల్ సంస్థ ఏపీకి వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మరిన్ని పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు.
ఆదాయ వనరుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలని గుర్తించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
జగన్ మోహన్ రెడ్డి చీప్ రాజకీయాలు మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ హితవుపలికారు. మెరుగైన సేవలు కోసమే పీపీపీ మోడల్ అని స్పష్టం చేవారు.
ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. ఎన్నికల వాగ్దానాలను గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.