Home » Operation Sindoor
సరిహద్దుల వెంబడి పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 40 శాతం, అంటే 2000 వరకూ డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ఎలాగో ప్రవేశించినప్పటికీ ఎలాంటి మరణాలు కానీ, నష్టం కానీ సంభవించలేదని గుజరాత్ బీఎస్ఎఫ్ ఐజీ పాఠక్ వివిరించారు.
ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ కొట్టివేశారు. యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని, ఎలాంటి పొరపాట్లు జరగాయన్నదే ముఖ్యమని ఆయన అన్నారు.
శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది.
ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చి చంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని ఎంజే అక్బర్ అన్నారు. దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
Pune Law Student: ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ శర్మిష్ట కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది.
కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయి ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోన్న అంశం.
భారత దౌత్యం ఫలించింది. భారత దాడుల్లో మృతి చెందిన పాకిస్థానీలకు సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా తాజాగా ఉపసంహరించుకుంది. వాస్తవాం తమకు తెలిసిందని పేర్కొంది.
భారత్, పాక్ల మధ్య రాజీ కుదిర్చింది తానేనని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నివారించినట్టు ప్రకటించారు.
సైనికులకు బాసటగా రాహుల్గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్పాయ్ కొనియాడిన విషయం కిషన్రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.