Home » Operation Sindoor
Madam N. ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. భారత్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్.
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కోల్కతా హైకోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.
బీజేపీ నేతలకు మాత్రం ఇండిపెండెన్స్ సమయం నుంచి లొంగుబాటు లేఖలు రాయడం అలవాటని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లొంగిపోయే వ్యక్తులు కారని, సూపర్ పవర్లను ఎదిరించి పోరాటం చేశారని అన్నారు.
పూణేకు చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలి మే 14న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక మతాన్ని కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ వీడియోను ఆమె తొలగించడంతోపాటు క్షమాపణలు కూడా తెలియజేశారు.
NDA Cabinet Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మండలి సమావేశం జరుగనుంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శర్మిష్ట అరెస్ట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ సర్కారుని కడిగిపారేశారు .
సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ గతంలో చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు అంతా తానే చేశానని చెప్పుకోవడం ఏమిటిని ఖర్గే ప్రశ్నించారు. సొంత గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదన్నారు.
ప్రపంచదేశాల్లో పాక్కు మద్దతు ఎందుకు లభిస్తోందంటూ కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ ప్రశ్నించారు. బాధిత దేశంగా భారత్ మిగిలితే పాక్ మాత్రం వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని అన్నారు.
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు.