Home » Odisha
నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగుతుంది. అయితే.. మగవారితో పోలిస్తే ఉద్యోగాలు చేసే ఆడవారు కాస్త ఎక్కువగా శ్రమిస్తుంటారు.
లోక్సభ ఎన్నికల వేళ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో బిజూ జనతాదళ్తో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతోందా? ఇరుపార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయా? అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు.
అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీ(PM Modi) తన కులం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఒడిశా(Odisha)లోని ఝార్సుగూడలో భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharath Jodo Nyay Yatra)లో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి కాదని.. జనరల్ కేటగిరీకి(OC) చెందిన వారని ఆరోపించారు.
ప్రపంచంలోని తొలి బ్లాక్ టైగర్ సఫారీ త్వరలో ఒడిశాలో ప్రారంభం కానుంది. మయూర్భంజ్లోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సఫారీ ప్లాన్ చేస్తోంది.
ఒడిశా(Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో రెండు బైక్లు, ఆటో, ట్రాక్టర్, డీసీఎం ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సుందరమైన ఇసుక కళ(Sand Art)ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి ఎక్స్లో(X) ఓ పోస్ట్ చేశారు.
జనవరి 22వ తేదీ రామ భక్తులకు ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన దినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆరోజు అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. అలాగే.. అదే రోజున ఒడిశాలో నిర్మించిన రామమందిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు.
భువనేశ్వర్: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్ కారిడార్' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి.