Share News

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:53 AM

భువనేశ్వర్‌: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి.

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

భువనేశ్వర్‌: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలే ధ్యేయంగా నూతన నిర్మాణాలు, మఠాలు, ఇతర ఆలయాల ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కారిడార్‌ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో భాగంగా శ్రీమన్నారాయణ మహా యజ్ఞం, శ్రీక్షేత్రం నాలుగు ద్వారాల వద్ద వేద పారాయణం, ఉపనిషత్తుల ప్రవచనాలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 08:56 AM