Home » Odisha
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' ఉందని కూడా ఆయన ఆరోపించారు.
ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు.
భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.
ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.
50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురి కంటే ఎక్కువ గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఒడిశా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అక్కడి అధికార బిజూ జనతాదళ్ పార్టీ బీజేపీతో కటీఫ్ చెప్పి 15 సంవత్సరాలు గడుస్తోంది.
ఒడిశాలో అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ తో పొత్తు పెట్టుకోనుందనే ఊహాగానాలకు భారతీయ జనతా పార్టీ తెరదించింది. బీజేడీతో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఒడిశా అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నాయి. పొత్తు ఖరారైన పార్టీలు ప్రచారంలో వేగం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోగా.. ప్రాధాన్యతా క్రమంలో సీట్ల పంపకం జరిగింది.
ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది.