Home » Odisha
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదని.. పాకిస్థాన్ అంటే ఆ పార్టీ భయపడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) సంచలన విమర్శలు చేశారు.
ఒడిశాలో అధికారం అందుకోవడం కోసం బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందని.. అయితే అది తమ పార్టీ విజయానికి దోహదం చేస్తుందని బీజేడీ నాయకుడు వీకే పాండ్యన్ వెల్లడించారు. ఒడిశాలో వరుసగా ఆరోసారి బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఒడిశా ముఖ్యమంత్రితో తనకున్న సత్సంబంధాలను ప్రధాని పక్కకు పెట్టేశారు. దీనికి కారణంపై మోదీ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా సమాధానం ఇచ్చారు. ఒడిశా రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఆపని చేసినట్టు చెప్పారు.
రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్లో ‘వారి’ జాడలే లేవన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్లో భాగంగా శనివారం ఒడిశాలోని ఆరు కీలక పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో పూరి, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, శంబల్పూర్, కోంఝార్ నియోజకవర్గాలు ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తన ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.
అవినీతిపై ఒడిశాలోని బిజూ జదనతాదళ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకోనుండటం ద్వారా ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.
ఒడిసాలో ఐదో దశ ఎన్నికలు జరిగే లోక్సభ నియోజక వర్గాల్లో డిప్యూటీ సీఎం భట్టి విస్తృత ప్రచారం చేపట్టారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయన ఒడిసాలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం అక్కడి నుంచి ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ప్రత్యేక విమానంలో ఒడిసాకు వెళ్లిన భట్టి.. బోలాంగిరి పరిధిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.
లోక్సభ ఎన్నికల నాలుగో దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. త్రిశంకు సభ (హంగ్ పార్లమెంటు) ఏర్పడిన పక్షంలో (నెల రోజుల క్రితం కంటే ఇది ఇప్పుడు సంభావ్య పరిణామంగా కనిపిస్తోంది) ప్రభుత్వం ఏర్పాటులో ఈ ‘అలీన’ పార్టీలే కీలక పాత్ర వహించనున్నాయి.