Home » NTR District
వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలూగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు, విద్యార్థుల సర్టిఫికెట్లు , ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరువూరులో గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారికి మరో వ్యాపారికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఏ.కొండూరు మండలం గోపాలపురం వద్ద ఒక రేషన్ వ్యాపారికి చెందిన లారీని మరో వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డగించారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇటీవల కాలంలో ఆడవారిపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద, శిశువు, వృద్ధులు అని తేడా లేకుండా ఆడవారు కనిపిస్తే చాలు కొన్ని మానవ మృగాలు వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. భారతదేశంలో పోక్సో చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గడం లేదు.
ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
Andhrapradesh: 48 గంటలుగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. దీంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టారు.
వరద సహాయక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. రెండో రోజు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను తన కార్యాలయంగా మార్చుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది.
ఎన్టీఆర్ జిల్లా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన వరద నీటిలో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు.
Andhrapradesh: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతి సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.