Home » NRI
బెంగళూర్కు చెందిన మహ్మద్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. అతని పేరు క్రిమినల్ పేరుతో పోలి ఉండటంతో జెద్దా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమచారం ఇచ్చారు. 22 ఏళ్ల క్రితం జరిగిన నేరానికి సంబంధించి గాలిస్తోన్న నేరస్థుని వివరాలు గౌస్తో సరిపోలాయి. గౌస్ను నేరం జరిగిన ప్రదేశం అసీర్లో (అభా) గల అల్ జరీబ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇది జెద్దా నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.
UAE Indian Consulate: దుబాయ్తో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్లోని(UAE) వివిధ ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల(Indian Migrants) సంక్షేమార్ధం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్.పి.పి)(LPP) అనే వినూత్న భీమా పథకాన్ని దుబాయిలోని భారతీయ కాన్సులేట్(Indian Consulate) ప్రకటించింది. యుఏఇ తో సహా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కేవలం రోడ్డు, వృత్తిపరమైన ప్రమాదాల కొరకు మాత్రమే భీమా పథకం అమలులో ఉండడంతో..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
బహ్రెయిన్లో ఫిబ్రవరి 23న జరిగిన ఇండో గల్ఫ్ 2024 త్రోబాల్ ఛాంపియన్ షిప్ లో అమెరికా ( America ) మహిళా టీమ్ స్పోర్టి దివస్ జట్టు విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్ షిప్ ను త్రోబాల్ ఫెడరేషన్తో కలిసి ది ఇండియన్ క్లబ్ నిర్వహించింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్ఠంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది.
ఇమేజింగ్ సాంకేతికతలో విప్లవాత్మక పరిశోధనలు చేసిన భారత సంతతి శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్కు ఇంజినీరింగ్ విభాగంలో ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ అవార్డు దక్కింది.
గతేడాది ఇతర దేశాలవారితో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ ఎయిర్పోర్టు ద్వారా రాకపోకలు సాగించారు.
కెనడాపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే.
హైదరాబాద్కు చెందిన నిఖిల కన్స్ట్రక్షన్స్కు ఏషియా బిజినెస్ అవార్డు దక్కింది. బుధవారం సింగపూర్లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు వెలువోలు ...
TDP Ireland: టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఐర్లాండ్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా టీడీపీ ఏపీ జనరల్ సెక్రటరీ చింతకాయల విజయ్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. తొలుత మాట్లాడిన విజయ్.. తెలుగు దేశం పార్టీ బలం, ధైర్యం కార్యకర్తలేనని అన్నారు.