Home » NRI Organizations
ఎడారి నాట తెలుగు ఇంజినీర్లకు మరింత గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఖతర్ తెలుగు ఇంజినీర్స్ ఫోరం అవిర్భవించింది. భారతీయ ఎంబసీ అధ్వర్యంలోని ఐ.బి.పి.సి మార్గదర్శకన తెలుగు ఇంజినీర్స్ ఫోరం పని చేస్తుంది.
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో భాగంగా వివిధ అమెరికా రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం, ఇతర ఆటా సభ్యులు పాల్గొన్నారు.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.
తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు కుటుంబం సజీవదహనం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టం మీద కొన్ని ఎముకలను మాత్రం సౌదీ పోలీసులు సేకరించగలిగారు. అయితే ఈ ఎముకలు ఎవరివి.? అన్నది కూడా గుర్తించేందుకు సౌదీ అరేబియా అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.
కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని హాంకాంగ్లో నిర్వహించిన సురభి ఏక ఎహసాస్ కార్యక్రమం ఎన్నారైలను ఆకట్టుకుంది.
తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తానా బృందం ఘనస్వాగతం పలికింది.
ఈనెల 7 నుంచి న్యూజెర్సీలో జరగనున్న తానా (TANA) మహాసభల సందర్భంగా తానా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.
రాస్ అల్ ఖైమా కేంద్రంగా పనిచేసే తెలుగు తరంగిణి అనే తెలుగు ప్రవాసీయుల సంస్థ ఈసారి రాస్ అల్ ఖైమాలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.