Home » Notice
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పోలీసులు (Delhi police) రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కదిరి, ఏప్రిల్ 26 : మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు న్యాయవాదిగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థి మక్బుల్బాషా తరఫున నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ప్రసాద్రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తరఫు న్యాయవాది కే. ప్రభాకర్రెడ్డి అభ్యంతరం తెలిపారు.
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
మహిళలను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ను ఎలక్షన్ కమిషన్ సోమవారంనాడు మందలించింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది.
రూ.1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను విభాగం నుంచి నోటీసు రావడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రభుత్వం మారిన తర్వాత తాము తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం ) కీలక సూచన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గత ఏడాది ''పనౌటి'' (చెడు శకునం), పిక్పాకెట్ అని సంబోధించారు. ఈ నేపథ్యంలో రాహుల్కు మార్చి 1న ఈసీ తాజా సూచనలు చేసింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత జైరామ్ రమేష్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లీగల్ నోటీసు పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.