Home » Nitish Kumar
సీఎం నితీశ్ కుమార్ అఖిల పక్ష భేటికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 9 ప్రధాన పార్టీలు భేటీకి హాజరుకావాలని ఆయన కోరారు. ఈ మీటింగ్ లో కుల గణన(Caste Census) నివేదికపై చర్చించనున్నారు. ప్రజల ఆర్థిక స్థితి గతులు, కులాల వారిగా సంక్షేమం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సందర్భంగా నితీశ్ బీజేపీపై విరుచుకుపడ్డారు.
లోక్సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సెక్రటేరియట్ కు వెళ్లి తన మంత్రులు విధుల్లో ఉన్నారో లేరో స్వయంగా పరిశీలించారు. ఎక్కువ మంది మంత్రులు తమ కార్యాలయాల్లో లేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) ఎన్డీఏ(NDA)లో చేరాలని భావిస్తున్నారనే వార్తలను ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో నితీశ్ ను ఎన్డీఏలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం ఉత్కంఠ...
మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బిహార్(Bihar) విద్యా శాఖ మంత్రి(Educational Minister) చంద్రశేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను ఇండియా కూటమి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి తనకేమీ తెలియదంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాదు..
సొంత పార్టీ లేదా కూటమి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు.. అందరూ దానికి కట్టుబడి ఉంటారు. ఏ ఒక్కరూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరు. కానీ.. ఇండియా కూటమిలో కీలక నేతగా...