Home » Nitish Kumar
బీహార్లోని అధికార పార్టీ జనతా దళ్-యునైటెడ్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్ష పదవికి లలన్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. జేడీయూలో కీలక వ్యక్తిగా పేరున్న లలన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు నేతలు ఇటీవల ప్రతిపాదించడంపై కూటమిలో చీలక ఏర్పడవచ్చనే ఊహాగానాలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తెరదించే ప్రయత్నం చేశారు. కూటమిలో పోస్ట్ కోసం తాను ఎలాంటి ఆసక్తి వ్యక్తం చేయలేదని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సవాలు చేసే పొలిటికల్ సూపర్స్టార్ల జాబితాను విపక్ష ఇండియా కూటమి పరిశీలిస్తోంది. సీట్ల షేరింగ్ వ్యవహారంపై ఇండియా కూటమి మంగళవారం సమావేశమైన మరుసటి రోజే ఈ జాబితాపై కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. నితీష్ కుమార్, ప్రియాంక గాంధీ వాద్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
తమ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని సుదీర్ఘకాలం నుంచి తాను చేస్తున్న డిమాండ్ని సీఎం నితీశ్ కుమార్ మరోసారి లేవనెత్తారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన తూర్పు జోనల్ కౌన్సిల్ 26వ సమావేశంలో...
ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) ఏర్పాటు చేసే మీటింగ్ కి తాను హాజరుకావట్లేదంటూ వస్తున్న వదంతులను బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఖండించారు.
డిసెంబర్ 6న జరిగే ఇండియా కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో వీరిద్దరు పాల్గొనకపోవచ్చు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చడిచూడటంపై జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమిలోని..
ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి బీహార్ ప్రభుత్వం లాంఛనంగా పెంచింది. పెంచిన కోటాకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు.
బిహార్(Bihar)కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం జేడీయూ(JDU) ఏళ్లుగా ఉద్యమం చేస్తోందన్నారు.