Home » New Parliament Building
హైదరాబాద్ మూసీ నది కాలుష్య నివారణపై ఎటువంటి ప్రతిపాదనా లేదని పార్లమెంట్లో కేంద్రం తేల్చిచెప్పింది. మూసీ నది కాలుష్య నివారణకు ఎటువంటి ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code - UCC) బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరుగుతాయని తెలిపారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగే మొదటి సమావేశాలు ఇవే.
అవును.. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించాం.. ప్రస్తుత పార్లమెంట్ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించాం..
దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్కు వచ్చింది. భిన్న కథనాలతో అంతా ఓ మిస్టరీగా మారింది.
అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...
నభూతో నభవిష్యతి అనే రీతిలో భారత దేశ నూతన పార్లమెంటు అద్భుత కట్టడంగా ఆవిష్కృతమైంది. సెంట్రల్ విస్టాలో భాగంగా రెండేన్నరేళ్లలోపు కొత్త భవన నిర్మాణం పూర్తయింది. అయితే, ఇదే సమయంలో పార్లమెంటు కొత్త భవనంలోని గోడపై ఏర్పాటు చేసిన 'అఖండ భారత్' మురల్ పెయిటింగ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరిగిన తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత తనకు ఏమాత్రం సంతోషం కలిగించలేదని అన్నారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు.