Home » New Delhi
ఇరాన్ నుంచి ఇంతవరకూ 2,295 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చినట్టు రణ్ధీర్ జైశ్వాల్ చెప్పారు. వీరితో పాటు ఇజ్రాయెల్లో నివసిస్తున్న 165 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 మిలటరీ రవాణా విమానంలో భారత్కు తీసుకువచ్చారు.
అమెరికా చట్టాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో పేర్కొంది.
కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సాంకేతిక లోపం కారణంలో ఢిల్లీ విమానం వెనక్కి రావడంతో ప్రత్యామ్నాయంగా జమ్మూకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఇరాన్లో చిక్కుకున్న తమ పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రులు 'ఆపరేషన్ సింధు' పేరుతో వారిని భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.
యుద్ధం, ఉద్రిక్తతల నడుమ తమకు సురక్షితంగా తీసుకువచ్చిన భారత ప్రభుత్వానికి విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ నుంచి తమను తరలించేటప్పుడు చక్కటి వసతి, లంచ్, డిన్నర్ వంటివన్నీ సకాలంలో అందించారని, తిరిగి స్వదేశానికి రావడం సంతోషంగా ఉందని అల్మాస్ రిజ్వి అనే స్టూడెంట్ తెలిపారు.
ఏప్రిల్ 21న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై అమిత్షా మాట్లాడుతూ, కశ్మీర్లో శాంతి, పర్యాటకాన్ని దెబ్బతీసి, కశ్మీర్ యువకులను తప్పదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ఇరాన్ నగరాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,000 మంది భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ సింధు' కింద ప్రత్యేక విమానాల్లో న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. రాబోయే రెండ్రోజుల్లో వీరంతా ఢిల్లీకి చేరుకుంటారు.
ఎయిర్ ఇండియా విమానం వెంటనే ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉందని, అయితే పక్షి ఢీకొట్టడంతో రిటర్న్ ఫ్లైట్ను రద్దు చేశామని ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.
తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్కు తీసుకువస్తున్నారు.