Home » Naveen Patnaik
అవయవాలు దానం చేసేవారిని గౌరవంగా సాగనంపాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒడిశాలో అవయవ దానం చేసిన ఎవరికైనా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) నడుస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా.. బిహార్(Bihar) లో ఇటీవల కుల గణన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కుల గణన(Caste Census) చేపట్టి సర్వే వివరాలు విడుదల చేయాలని భావిస్తోంది.
జి-20 సదస్సు ప్రారంభం సందర్భంగా అతిథుల గౌరవార్ధం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు ఇస్తున్న విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఆయన గైర్హాజరు వెనుక ఇతమిద్ధమైన కారణాన్ని తెలియజేయలేదు.
కోణార్క్ వీల్ను న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించిన మిషెలిన్ స్టార్డ్ చెఫ్, ఎంటర్ప్రైజింగ్ ఎంటర్ప్రెన్యూవర్ వికాస్ ఖన్నాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఒడిశాకు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో కోణార్క్ చక్రం ఒకటి అనే విషయం తెలిసిందే.
దేశంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసును ఆయన వెనక్కి నెట్టారు. ఈ జాబితాలో తొలి స్థానంలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించి నవీన్ పట్నాయక్ మరోసారి సీఎం అయితే అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురై, 288 మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు దాదాపు 1,000 మంది గాయపడటంతో ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినవారిలో వివిధ దేశాల అధినేతలు ఉన్నారు. బాధితులకు తమకు చేతనైనంత సాయం చేయడానికి స్థానికులు కూడా ముందుకు వచ్చారు.
అక్రమార్కులకు అన్నిటిలోనూ అవకాశాలు కనిపిస్తాయి. దురాశపరులు శవాల మీద పేలాలు ఏరుకుంటారని అంటారు.
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొని 288 మంది మృతిచెందిన నేపథ్యంలో కోల్కతా వెళ్లే ప్రయాణికుల కోసం ఉచిత బస్సు సర్వీసులను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రైలు సర్వీసులు పునరుద్ధరించేంత వరకూ ఈ సదుపాయం అమలులో ఉంటుంది.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు.
భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత విషాదకర రైలు ప్రమాదం శుక్రవారం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్స్ రైలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి.