Home » Nagababu
జనసేన కేంద్ర కార్యాలయానికి సినీ నటుడు పృధ్వీ వచ్చారు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. పార్టీ కీలక నేతలైన నాదెండ్ల మనోహర్, నాగబాబులను పృధ్వీ కలిశారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ.. ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారన్నారు. ఐదేళ్ల నుంచి ఫ్యాన్ వేస్తున్నారని.. ఇక ఆపాలలని చెబుతూనే ఉన్నానన్నారు.
జనసేన పార్టీ కీలక నేత నాగబాబు.. కూటమి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని.. కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలకు ట్విటర్ వేదికగా తెలిపారు.
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిశోర్ రెడ్డి నివాసానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు. ఆ క్రమంలో సదరు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.
Andhrapradesh: వైసీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రోడ్ షోలో నాగబాబు మాట్లాడుతూ... మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని.. వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ డబ్బులు అందచేయడంతో పాటు.. డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్ళపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని సంచలన అంశాలు బయటపపెట్టారు.
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
ఒక యాంకర్.. రెండు పార్టీల తరపున ప్రచారం.. అదేమిటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు.. ఒకరంటే మరొకరికి అసలు పడదు. అలాంటిది ఒక మనిషి రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం ఏమిటనుకుంటు న్నారా.. మీరు చదువుతున్నది నిజమే..
వైసీపీ(YSRCP) ట్రాప్లో పడి జనసేన(Janasena)కు నష్టం చేసే పనులు చేయొద్దని పార్టీ నేతలకు జనసేన నేత నాగబాబు(Nagababu) హెచ్చరించారు. గురువారం నాడు తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో తిరుపతి జనసేన నేతలతో నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు జనసేన నేతలతో నాగబాబు ఈ ఎన్నికల్లో కీలక విషయాలపై చర్చించారు.
జనసేన (Janasena) నేత, సినీ నటుడు కొణిదెల నాగబాబు (Nagababu) రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనట్లే కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి కూడా అన్ని మార్గాలను సుగమం చేసుకున్నారు. కూటమిలో ఉన్న జనసేన - తెలుగుదేశం పార్టీ(టీడీపీ) - బీజేపీ నేతలను కూడా కలిసి తనకు మద్దతివ్వాలని కూడా నాగబాబు కోరారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.