• Home » Money

Money

Credit Cards: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా ఈజీగా చేసుకోండి

Credit Cards: క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ ఇలా ఈజీగా చేసుకోండి

క్రెడిట్ కార్డు లిమిట్ ఎంతున్నా.. దాన్ని బ్యాంక్ అకౌంట్‌‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి(Money Transfer from Credit Card to Bank Account) ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్‌లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.

CASH : రూ.38 లక్షల నగదు పట్టివేత

CASH : రూ.38 లక్షల నగదు పట్టివేత

అమరాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండ త రలిస్తున్న రూ. 38లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్‌ఐ జనార్దననాయుడు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలుకా మరిదాసనహళ్లికి చెందిన మంజునాథ్‌ స్విఫ్ట్‌ కారులో తుమకూరు నుంచి ఆంధ్రప్రదేశ అమరాపురం మండలం మద్దనకుంట మీదుగా మరిదాసనహ ళ్లికి వెళ్లుతున్న సమయంలో అతని వద్ద 38లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామని, నగదుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళ్లుతుండగా నగదును సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

AP ELECTIONS : ఓటుకు రూ.2 వేలు

AP ELECTIONS : ఓటుకు రూ.2 వేలు

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ డబ్బు పంపిణీని ప్రారంభించింది. ఓటుకు రూ.2 వేల ప్రకారం బుధవారం పంచినట్లు తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం నియోజకవర్గంలో తిష్టవేసి.. డబ్బు పంపిణీ వ్యవహారాలను చూస్తోందని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన నాయకులకు డబ్బులు చేరవేసి.. అక్కడి నుంచి పంచాయతీల వారీగా డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో వలంటీర్లను దగ్గర పెట్టుకుని.. వైసీపీ...

PENSIONS : ఏమైనా పద్ధతా..?

PENSIONS : ఏమైనా పద్ధతా..?

పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...

AP Elections: రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

AP Elections: రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

YSR AASARA : ఇంకెప్పుడు ఆసరా..?

YSR AASARA : ఇంకెప్పుడు ఆసరా..?

సీఎం జగన బటన నొక్కి మూడు నెలలు అవుతున్నా పొదుపు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్‌ ఆసరా సొమ్ము జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా 5,190 మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందలేదు. ఇవన్నీ ఓసీ, బీసీ సామాజికవర్గ మహిళల గ్రూపులేనని సమాచారం. జిల్లా వ్యాప్తంగా వీరికి రూ.41.36 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని దిక్కు తెలియని స్థితిలో మహిళలు ఉన్నారు.

Loksabha Polls: నోట్ల కట్టల కలకలం.. భారీగా పట్టుబడ్డ నగదు

Loksabha Polls: నోట్ల కట్టల కలకలం.. భారీగా పట్టుబడ్డ నగదు

లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు.

Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..?

Loksabha Polls: ఊపందుకున్న ప్రచారం.. భారీగా పట్టుబడుతోన్న నగదు.. ఎంతంటే..?

లోక్ సభ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం పతాకస్థాయికి చేరింది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటుకు ఎంతయినా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఎన్నికల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు.

Loksabha Polls: జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా.. రూ.75 లక్షల నగదు సీజ్

Loksabha Polls: జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా.. రూ.75 లక్షల నగదు సీజ్

లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జొమాటో డెలివరీ బాయ్ నగదు రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. నగదు పట్టివేతకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి