Home » Minister Narayana
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
Andhrapradesh: అమరావతి ల్యాండ్ పూలింగ్ అనుమానాలను నివృత్తి చేసేందుకు మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. విజయవాడలోని రాజధాని రైతు అనుమోల్ గాంధీ నివాసానికి మంత్రి వెళ్లారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలువురు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పూలింగ్ అంగీకార పత్రాలను స్వీకరించారు.
'పీఎం స్వనిధి'' పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్ధిదారులను మంత్రి నారాయణ సన్మానించారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు.
జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు.
రాజధాని రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామమని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు.
ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు.
Andhrapradesh: గత మూడు రోజులుగా మంత్రులు లోకేష్ , నారాయణ, సత్యకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్రమంత్రులను, మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులను మంత్రులు కలుస్తున్నారు. నిన్న (సోమవారం) హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు.
Andhrapradesh: రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్ టాటా అని తెలిపారు. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు.
బుడమేరు వాగు ఉప్పెనతో ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలనుసారం ఆపరేషన్ బుడమేరు అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అదికారులతో నెల్లూరులో సమీక్ష నిర్వహించామని అన్నారు. పది రోజుల్లో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయాలనీ ఆదేశాలిచ్చాని తెలిపారు.