Home » Minister Gummadi Sandhya Rani
గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకి గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపామని పేర్కొన్నారు.
కేజీహెచ్లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
Minister Gummidi Sandhyarani: మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజూ గుడ్డు, పాలు అందిస్తున్నామని అన్నారు. పాలు ఇరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని మంత్రి తెలిపారు.
Minister Gummadi Sandyarani: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.అబద్ధాల్లో ఆస్కార్ పొందే సైకో జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని ప్రజలు ఎన్నుకుంటే... అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు.
విజయనగరం జిల్లా: రామభద్రాపురంలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఎస్కార్టు వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం వ్యాన్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ముగ్గురుతోపాటు ముగ్గురు గన్మెన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
అరకులోయ పార్లమెంట్ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...