Home » Minister Anitha
డీజీపీ ఆఫీస్లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.
మహిళల మరణాలకు కారణమయ్యే వారికి భయం క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. స్మార్ట్ పోలీసింగ్కు మరో మూడువేల సీపీ కెమెరాలు తిరుపతిలో ఏర్పాటుకు యత్నిస్తామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి మళ్లీ టాస్క్ ఫోర్స్ రంగంలోకి వస్తోందని
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని హోంమంత్రి అనిత కలిశారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని హోంమంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు గాడి తప్పాయని వాటిని గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఐదేళ్లలో జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరించాలని కోరారు.
పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగ్రాతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ... మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
అభంశుభం ఎరుగని చిన్నారులను కలుషితాహారం కాటేసింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ‘పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన మందిరం’ పేరిట నడుపుతున్న అనాథాశ్రమంలో ఘోరం జరిగింది.
వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖపట్నం నుంచి అన్ని జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మహీంద్రా వాహన తయారీ సంస్థ పోలీసులను బ్లాక్లో పెట్టిందని గుర్తుచేశారు.
సైకో జగన్ పాలనలో శాంతిభద్రతలను.. ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునని హోంమంత్రి వంగలపూడి అనిత ( Home Minister Vangalapudi Anitha) అన్నారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.