Home » MIM
హైదరాబాద్ లోక్సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కలిసొచ్చే ప్రతి అంశాన్ని వాడుకుంటున్నారు. ఒకవైపు పాతపద్ధతిలో ఇంటింటి ప్రచారం చేస్తూనే మరోవైపు స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)తో ‘స్మార్ట్‘గా ప్రచారం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ పరిధిలోని ఓ బస్తీ సంఘం నాయకులు మొన్నటి వరకు ఓ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. రెండు, మూడు రోజులుగా అదే నాయకులు మరో గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ, నాలుగుసార్లు ఓటమి ఎరుగని నేతగా.. హైదరాబాద్(Hyderabad) ఎంపీగా విజయాలు అందుకున్న అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ ఎన్నికల్లో భయపడుతున్నారా?
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 7గంటల నుంచే పార్టీల నాయకులు బస్తీలు, కాలనీల మీద ప్రచార దాడిని సాగిస్తున్నాయి. ఉదయం ఆరు గంటల కల్లా కార్యకర్తలను పార్టీ కార్యాలయాలకు రప్పించి టిఫిన్లు పెట్టించి జెండాలను పట్టించి రంగంలోకి దింపుతున్నారు.
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.
పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.
Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.