Home » Military
ప్రధాన మంత్రి మోదీ స్పష్టం చేశారు — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను వేరు చేయమని, అణ్వస్త్ర బెదిరింపులను భారత్ ఏమాత్రం భయపడదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై విధ్వంసకర దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవణె, యుద్ధం బాలీవుడ్ సినిమా కాదని, దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యుద్ధం చివరి పరిష్కారంగా మాత్రమే ఉండాలని ఆయన సూచించారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత త్రివిధ దళాలు పాకిస్థాన్లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. నూర్ఖాన్, రహీమ్యార్ఖాన్ వంటి ముఖ్యమైన ఎయిర్బేస్ల రన్వేలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.
భారత్-పాక్ డీజీఎంవోలు హాట్లైన్ భేటీలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైన్యాన్ని తగ్గించాలని, డ్రోన్, మిసైల్ దాడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అయినప్పటికీ, మోదీ ప్రసంగానంతరం పాక్ డ్రోన్లు భారత్లోకి ప్రవేశించగా, వాటిని భారత సైన్యం సమర్థంగా కూల్చివేసింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆపరేషన్ సిందూర్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అమెరికా హస్తక్షేపంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.
జమ్ముకశ్మీర్లో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ పార్థివదేహం స్వగ్రామం కళ్లితండాకు తరలించారు.మంత్రి సవిత, పవన్ కల్యాణ్, లోకేశ్ తదితరులు నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్థాన్ ఉల్లంఘించింది. డ్రోన్లతో దాడులు జరిపి బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం చెందారు.
కోడుమూరు పోలీసులపై దేశభక్తి చూపిన సైనికుల తల్లులకు ఘనంగా సన్మానం. వీర జవాన్ల మాతృమూర్తుల పాదసేవ చేస్తూ, వారి త్యాగాన్ని కీర్తించారు.
భవిష్యత్తులో భారత్లో జరిగే ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది.