Home » Medchal
హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మంత్రాల పేరిట అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కిష్టపూర్లో ఒడిశా వాసి తన భార్య ఆరోగ్యం బాగోలేదని సహద్యోగి షేక్ మోసిన్ (41)కు చెప్పుకున్నాడు. అయితే తనకు తెలిసిన మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించాడు.
ప్లాట్ రిజిస్ట్రేషన్కు గజానికి రూ.100 చొప్పున మొత్తం రూ.99,200 లంచం తీసుకున్న సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు తన 1,240 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు మూణ్నెల్ల క్రితం సబ్-రిజిస్ట్రార్ బానోత్ సురేందర్నాయక్ను కలిశారు.
నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్, డెము, ఎక్స్ప్రెస్ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మే 25: ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య మండలి హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్ పరిధిలో పలు క్లినిక్లపై అధికారులు దాడులు నిర్వహించి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అనుమతుల లేకుండా నిర్వహిస్తున్న పలు క్లినిక్లను సీజ్ చేశారు.
మేడ్చల్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ (FTL)లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి.
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామరం జీహెచ్ఎంసీ సర్కిల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (SFA) కిషన్ రాసలీలల ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలనిపై కన్నేసిన ఆ ఉద్యోగి, శానిటేషన్ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నాడు.
సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medical MLA Chamakura Mallareddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైల్లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేడలా కూలుతుంటే.. మరో పార్టీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోంది. అవేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు.
Telangana: నాలుగేళ్ల బాబు కిడ్నాప్ను రెండు గంటల్లోనే చేధించిన శభాష్ అనిపించుకున్నారు సూరారం పోలీసులు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న (గురువారం) నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న మల్లారెడ్డి ఆసుపత్రిలో ఇషాన్ రెడ్డి (4) అనే బాబు కిడ్నాప్కు గురయ్యాడు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు తమ కుమారుడు ఇషాన్ రెడ్డితో కలిసి నిన్న (గురువారం) మల్లారెడ్డి హాస్పటల్కు మెడికల్ చెకప్ కోసం వచ్చారు.
Telangana: మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడ అపార్ట్మెంట్లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు మూడు కిలోల గంజాయిని ఎక్సైజ్ ఇన్ఫోస్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్ముతున్నట్లు గుర్తించారు.