• Home » Marathi

Marathi

మండుటెండలో నిరాహార దీక్ష ప్రారంభించిన మనోజ్ జారంగే

మండుటెండలో నిరాహార దీక్ష ప్రారంభించిన మనోజ్ జారంగే

మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంతర్వాలి సరతి గ్రామంలో మండుటెండల మధ్య ఆయన శనివారంనాడు నిరసన దీక్షకు కూర్చున్నారు.

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి

ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం తర్వాతి కాలంలో భారత దేశమంతటా విస్తరించింది. నేటికీ శివాజీ మహరాజ్ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా నిలుస్తారు.

Manoj Jarange Chalo Mumbai: మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

Manoj Jarange Chalo Mumbai: మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

బీడ్ జిల్లాలోని మంజర్‌సుమ్బాలో ఆదివారంనాడు నిర్వహించిన ర్యాలీలో మనోజ్ జారంగే మాట్లాడుతూ, తమ ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర రాజధానికి మళ్లించినట్టు చెప్పారు. తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామం నుంచి ఆగస్టు 27న ఈ ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు.

Maharashtra: నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maharashtra: నన్ను మీరు కొడితే.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భాషపై హింసాత్మక ఘటనల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని, ఇది దీర్ఘకాలంలో మహారాష్ట్రకు నష్టం కలిగిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ప్రతి ఒక్కరి మాతృభాషను మనం గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు.

PM Modi: మరాఠీలో మాట్లాడేదా.. రాజ్యసభ నామినీతో మోదీ సరదా సంభాషణ

PM Modi: మరాఠీలో మాట్లాడేదా.. రాజ్యసభ నామినీతో మోదీ సరదా సంభాషణ

తన నామినేషన్ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిగా తనకు తెలియజేశారని, అప్పుడు మరాఠీలోనే మోదీ తనతో మాట్లాడారని ఉజ్వల్ నికం చెప్పారు.

Minister Pratap Baburao: ప్రతిపక్షం నిరసన ర్యాలీలో మంత్రి

Minister Pratap Baburao: ప్రతిపక్షం నిరసన ర్యాలీలో మంత్రి

మరాఠా అస్తిత్వం కోసమంటూ మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంఎన్‌ఎస్‌ పార్టీ మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏక్‌నాథ్‌ శిందే శివసేన వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు ప్రతాప్‌ బాబూరావు సర్‌నాయక్‌ పాల్గొనడం సంచలనమైంది.

Marathi row: ఇన్వెస్టర్ సుశీల్ కేడియా కార్యాలయంపై దాడి.. ట్వీట్ చేసిన కాసేపటికే

Marathi row: ఇన్వెస్టర్ సుశీల్ కేడియా కార్యాలయంపై దాడి.. ట్వీట్ చేసిన కాసేపటికే

మరాఠీ వివాదంపై రాజ్‌థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని అన్నారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని, ఇందుకు ప్రతిగా తాను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు.

Actor Tushar: పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..

Actor Tushar: పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..

Tushar Ghadigaonkar: గత కొన్నేళ్ల నుంచి అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రాణాలు తీసుకున్నాడు.

Mumbai: ముంబైలో ఘార ప్రమాదం.. గాయపడిన నటి, మెట్రో కార్మికుడు మృతి

Mumbai: ముంబైలో ఘార ప్రమాదం.. గాయపడిన నటి, మెట్రో కార్మికుడు మృతి

శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని కారులో నటి తిరిగి వెళ్తుండగా పోయిసర్ మెట్రా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొంది

Sharad Pawar: మహారాష్ట్ర మరో మణిపూర్ కావచ్చన్న పవార్..  తప్పుపట్టిన బీజేపీ

Sharad Pawar: మహారాష్ట్ర మరో మణిపూర్ కావచ్చన్న పవార్.. తప్పుపట్టిన బీజేపీ

మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి