Home » Maoist Encounter
ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావుల మృతదేహాల కోసం ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించాలంటూ హైకోర్టు కుటుంబ సభ్యులకు సూచించింది. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం స్థానిక పోలీసులకే వదిలింది.
Jharkhand Naxal Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఝార్ఖండ్లోని లతేహార్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరాటం జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మావోయిస్టు అగ్రనేత సహా 27 మంది మృతి చెందిన ఈ ఘటనను హత్యలుగా అభివర్ణించారు.
వరంగల్ ఆర్ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్వార్ గ్రూప్లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు.
Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.
సీపీఐ మావోయిస్టుల కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వేణుగోపాల్, రాజన్లలో ఒకరు లేదా గణపతికే మళ్లీ బాధ్యతలు ఇవ్వవచ్చని చర్చ సాగుతోంది.
ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.
ఛత్తీస్గఢ్ అబూజ్మఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు.
శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.