Home » Maoist Encounter
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్,,
రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్లో ‘వారి’ జాడలే లేవన్నారు.
అల్లూరు జిల్లా జి.కె.వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్(Maoist dump) స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా(Tuhin Sinha) వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Encounter in Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 12 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.
Encounter in Chhattisgarh: ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్(Police Encounter) జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
Telangana: ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రెస్నోట్ విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్కౌంటర్, క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మందిని పోలీస్ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలను ఫోర్స్ క్లెయిమ్ చేయగా, వాటిలో 18 తప్పుడు ఎన్కౌంటర్లు అని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీ్సగఢ్లోని బీజాపూర్ జిల్లా పిడియా గుట్టల్లో కేంద్ర బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.