Home » Manmohan Singh
మన్మోహన్ సింగ్ గొప్ప మనిషి, నిరాడంబరుడు, దేశ భక్తుడని డాక్టర్ పాండా చెబుతూ, తన పేషెంట్ల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మన్మోహన్ ఎప్పటికీ గుర్తిండిపోతారని అన్నారు.
TELANGANA: తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ సహకారం మరువరానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని మన్మోహన్ సింగ్ నింపారని గుర్తుచేశారు.
CM Chandrababu: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేశారు! నాటి ప్రధాని పీవీ నరసింహారావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు!
మన్మోహన్కు ఆయన సొంత కారు 'మారుతి 800'తో ఎంతో అనుబంధం ఉండేదని ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చీఫ్గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అసీమ్ అరుణ్ తెలిపారు.
ఆర్థికవేత్తగా, ప్రధానిగా అపార ప్రతిభాపాటవాలు కనబరిచిన మౌన మునిగా కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అనేక సందర్భాల్లో ఆయన మౌనంగా ఉండిపోవడంపై ప్రతిపక్షాలు అనేక సార్లు ఆయన్ను టార్గెట్ చేసుకునేవి. దీనికి ఆయన 2018లో దీటైన సమాధానం ఇచ్చారు.
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సింగ్ సహకారం ఎప్పటికీ గుర్తుంటుందని సంఘ్ పేర్కొంది.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయస్సులో ఆయన నిన్న రాత్రి 9:51 గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే ఈ మాజీ ప్రధాని ప్రస్తుత ఆస్తులు ఎంత అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. కాగా శుక్రవారం ఉదయం 11గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. అలాగే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసింది.