• Home » Mancherial

Mancherial

రైతు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన

రైతు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం గూడెం ఎత్తిపోతల నీటిని ఆదివారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణతో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.

కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తను గుర్తిస్తామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్‌ చైర్మన్‌ సయ్యద్‌ పసివుల్లాతోపాటు పది మంది డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిం చారు.

అటవీ ప్రాంతంలో పర్యాటకుల సందడి

అటవీ ప్రాంతంలో పర్యాటకుల సందడి

కవ్వాల టైగర్‌ జోన్‌లో బర్డ్‌వాచ్‌ పర్యాటకులను ఆకర్షించింది. ఆదివా రం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్డ్‌వాచ్‌కు 15 మంది పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి ఇందన్‌పల్లి రేంజ్‌లోని అటవీ ప్రాంతంలోని గన్‌శెట్టి కుంట వద్ద ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేశారు.

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

సొంతిళ్లు పేద, మధ్యతరగతి గూడు కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంది రమ్మ పేరుతో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిం చింది. ఇందుకుగానూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మహిళల పేరిట దరఖాస్తులు స్వీకరించింది. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా కేవలం అర్హులకు లబ్ధి జరిగేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా

మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసి మంచిర్యాలను సర్వాంగ సుందరంగా మారుస్తానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని మహా ప్రస్తాన నిర్మాణ పనులను, మార్కెట్‌ ఏరియాలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలను పరిశీలించారు.

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణ, డీఈ దశరధంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. శనివా రం నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట గ్రామాల్లో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే హరితహారం కోసం మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా

హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా

హమాలీల సమ్మెతో చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. సంక్రాంతి పిండి వంటలు చేసుకోవ డానికి ఎక్కువ శాతం రేషన్‌ బియ్యం వినియోగిస్తారు. పండుగ సమీపిస్తున్నా రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ జరగడం లేదు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

పోలీసులు క్రమశిక్షణ కలిగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌పరేడ్‌)కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫూలే జయంతిలో డీసీపీ భాస్కర్‌, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి