Home » Mancherial
ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్లో ఆదివారం పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్రావు ఆదివారం పేర్కొన్నారు.
మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు.
జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్వో హరీష్రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత, కుప్తి, మందాకిని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పేర్కొ న్నారు. శుక్రవారం మంచిర్యాలలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముం దు సీఎం రేవంత్రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి మర్చిపోయారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారమేష్ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వేంపల్లి గ్రామం ఇండస్ర్టియల్ హబ్గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ర్టియల్ హబ్ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు.