Home » Mallikarjun Kharge
Rahul Gandhi Skip Red Fort: కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు మాత్రం ఎర్రకోటకు వెళ్లలేదు. వీరు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనకపోవటంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తోడు.. ఓబీసీ ఓటుబ్యాంకుపైనా కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టిందా? ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులనే అస్త్రాలుగా వాడేందుకు సిద్ధమైందా..
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు.
ఆపరేషన్ సిందూర్పై రాజ్యసభలో చర్చించేందుకు కాంగ్రెస్కు సుమారు రెండు గంటల సమయం కేటాయించారు. ఈ చర్చలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కష్టపడి పనిచేసినా ముఖ్యమంత్రిని కాలేకపోయానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకే ధన్ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ, ఆ విషయాలు తనకు తెలియదని, ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షానే ఉండేవారని, అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.
తెలంగాణలో విస్తృత స్థాయిలో, శాస్త్రీయంగా, అర్థవంతంగా కులగణన జరిపిన తీరు దేశానికే ప్రామాణికంగా నిలిచిందని కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, ఆయన బృందాన్ని ప్రశంసించింది.
దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని... కానీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.