Home » Mallareddy
సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medical MLA Chamakura Mallareddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైల్లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేడలా కూలుతుంటే.. మరో పార్టీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోంది. అవేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు.
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్ళలు గుప్పించారు. బుధవారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తామే గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వాళ్ళు చేసిందేమీ లేదని, ఓటు అడిగే హక్కు ఆ రెండు పార్టలకు లేదని అన్నారు.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) యూనివర్శిటీలో జరిగిన ఆందోళనలపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (MLA Rohit) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొడితే హీరోయిజమా.. తాము చేస్తే రౌడీజయమా అని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే రాజకీయం..తాము చేస్తే వ్యభిచారమా అని అన్నారు.
70వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చి దిద్దుతున్నామని మల్లారెడ్డి యునివర్సిటీ డెరైక్టర్ భద్ర రెడ్డి(Bhadra Reddy) అన్నారు. కళాశాల లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.
Telangana: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
రేవంత్రెడ్డి(Revanth Reddy) సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి(Former minister Mallareddy) తనదైన శైలిలో చెప్పారు.
బెంగళూరులోని ఓ హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar)ని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరో బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిశారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవ్వరు ఎంపీగా పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి తాజా పరిణామాలు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
దేశంలోనే అతి పెద్ద లోక్సభ స్థానం మల్కాజిగిరి(Malkajigiri)లో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్(BRS) నుంచి ఇక్కడ ఎవరు బరిలో దిగుతారన్నది చర్చనీయాంశంగా మారింది.