Home » Mahesh Kumar Goud
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు జెట్టి కుసుమ్ కుమార్, కుమార్రావుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రతీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ దేవుడి పేరును వాడుకొని లబ్ధి పొందుతోందని, మతవిద్వేషాలతో ఎన్నికల్లో లబ్ధి కోరుకోవడం దేశాభివృద్ధికి విఘాతమని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ విమర్శించారు.
ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి, మంత్రులకు ఎలాంటి భేషజాలు లేవని, సమష్ఠి నిర్ణయాలతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని, సీఎం రేవంత్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ పిలుపునిచ్చారు.
‘‘రెడ్డి కులంలో పుట్టిన సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువస్తానని ప్రకటించారు. ఓబీసీని అని చెప్పుకుంటున్న మోదీ.. 11 ఏళ్ల పాలనలో బీసీల కోసం ఏం చేశారు?’
కోడి పందేల కోసం ప్రత్యేకంగా బరి! కోళ్ల మధ్య పోరును చూసేందుకు చుట్టూ ప్రత్యేకంగా చుట్టూ గ్యాలరీలు! రాత్రుళ్లలోనూ పందేలను వీక్షించేందుకు ఫ్లడ్లైట్ల ఏర్పాటు! పందేలతోపాటు క్యాసినోలో డబ్బులు వెదజల్లే వారి కోసం భారీ స్థాయిలో మద్యం, భోజన ఏర్పాట్లు!
ప్రస్తుతం కులాల వారీగా బయటకు వస్తున్న లెక్కలన్నీ తప్పేనని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సవాల్ విసిరారు.
Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్లో తెలంగాణకు వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని ఆక్షేపించారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీగా వస్తోందని విమర్శించారు.