• Home » Mahabubnagar

Mahabubnagar

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

Miyapur: హత్యాచార నిందితులను విడిచిపెట్టం..

హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఏటిగడ్డతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన గిరిజన బాలిక (12) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క హామీనిచ్చారు. నిందితులు ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Mahabubnagar: ఇద్దరిని చిదిమేసిన కలప లారీ!

Mahabubnagar: ఇద్దరిని చిదిమేసిన కలప లారీ!

కలప లోడుతో వెళుతున్న ఓ లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దుర్మరణం చెందారు. మృతు శకటంలా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. రోడ్డుపక్కన టీ తాగుతున్న వారిపై బోల్తా పడటంతో ఈ ఘోరం జరిగింది

Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు

Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు

ఎక్కడైనా.. ఎవరికైనా.. కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఒక నెలలో విద్యుత్ వాడకాన్ని బట్టి కరెంట్ బిల్లు.. వందల్లో.. వేలల్లో వస్తుంది. అదే వాణిజ్య సముదాయం అయితే రూ. లక్షల్లో వస్తుంది.

Lok Sabha Elections: రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..

Lok Sabha Elections: రాష్ట్రంలో నోటాకు తగ్గని ప్రాధాన్యం..

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ చెరో 8 స్థానాలు కైవసం చేసుకోగా మజ్లిస్‌ ఓ చోట గెలుపొందింది. అయినప్పటికీ ఆయా స్థానాల్లో నోటా ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని స్థానాల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు లభించడం విశేషం.

Lok Sabha Elections TG: కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

Lok Sabha Elections TG: కొందరికి మోదం.. కొందరికి ఖేదం!

లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.

TG News: కమల వికాసం.. కాంగ్రెస్‌ దరహాసం..

TG News: కమల వికాసం.. కాంగ్రెస్‌ దరహాసం..

కమలం వికసించింది.. కాంగ్రెస్‌ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్‌ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్‌ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్‌ఎస్‌ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.

Hyderabad: తీర్పుకు వేళాయె..

Hyderabad: తీర్పుకు వేళాయె..

హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.

Hyderabad: పాలిసెట్‌ లో 84%ఉత్తీర్ణత

Hyderabad: పాలిసెట్‌ లో 84%ఉత్తీర్ణత

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, పెనుబల్లి, జూన్‌ 3: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.

Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం

Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి